సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- సురేందర్ రెడ్డి సినిమాలో రష్మిక?
- 'రేడియో మాధవ్'గా విజయ్ సేతుపతి
- షూటింగ్ మొదలెట్టిన నాగశౌర్య
* ప్రముఖ తమిళ కథానాయకుడు విజయ్ సేతుపతి గతేడాది మలయాళంలో నటించిన 'మార్కొని మత్తయ్' చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేస్తున్నారు. 'రేడియో మాధవ్' పేరుతో డబ్ అవుతున్న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
* నాగ శౌర్య హీరోగా లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం షూటింగ్ నిన్నటి నుంచి హైదరాబాదులో జరుగుతోంది. కథానాయిక రీతూ వర్మ కూడా షూటింగులో పాల్గొంటోంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ దీనిని నిర్మిస్తోంది.