భారీ వర్షాలు కురుస్తున్నాయి... పాత భవనాల యజమానులకు నోటీసులు పంపండి: కేటీఆర్ ఆదేశాలు
- హైదరాబాదులో భారీ వర్షాలు
- శిథిల భవనాలను గుర్తించాలన్న కేటీఆర్
- తక్షణమే ఖాళీ చేయించాలని స్పష్టీకరణ
పాత భవనాల యజమానులకు నోటీసులు జారీ చేయాలని, ఆ భవనాల్లో నివసిస్తున్న వారిని తక్షణమే ఖాళీ చేయించాలని స్పష్టం చేశారు. ప్రాణ నష్టాన్ని నివారించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు పాత భవనాల యజమానులకు వివరించాలని కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు.
ఈ వర్షాకాలంలో హైదరాబాద్ నగరం అత్యధిక వర్షపాతాన్ని చవిచూసింది. ఈ క్రమంలో పాత భవంతులు కూలిపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.