అందరికీ ధన్యవాదాలు: కవిత
- ఎమ్మెల్సీ ఎన్నికలో కవిత ఘన విజయం
- కాంగ్రెస్, బీజేపీలకు దక్కని డిపాజిట్లు
- తన గెలుపుకు అందరూ కష్టపడ్డారన్న కవిత
మరోవైపు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, అబద్ధపు మాటలు చెప్పి బీజేపీ నేతలు మోసం చేశారని... అయినా ఎవరూ వారిని నమ్మలేదని అన్నారు. విపక్షాల అబద్ధాలకు బదులుగా కవితకు విజయాన్ని కట్టబెట్టారని చెప్పారు. మరోసారి న్యాయం గెలిచిందని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు కూడా దక్కలేదని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికలో కవితకు 728 ఓట్లు పడ్డాయి. ఈ నెల 14న కవిత ఎమ్మెల్సీగా ప్రమాణం చేయనున్నారు.