Srikakulam District: లిబియాలో కిడ్నాప్ కు గురైన తెలుగు వారికి విముక్తి

  • ఉపాధి కోసం లిబియా వెళ్లిన శ్రీకాకుళం వ్యక్తులు
  • భారత్ కు వచ్చే క్రమంలో అపహరణకు గురైన వైనం
  • కేంద్రానికి లేఖ రాసిన ఎంపీ రామ్మోహన్ నాయుడు
Kidnapped Telugu youth freed in Libya

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం సీతానగరం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఉపాధి కోసం లిబియా వెళ్లి అక్కడ ఇటీవల అపహరణకు గురయ్యారు. బచ్చల వెంకట్రావు, బొడ్డు దానయ్య, బచ్చల జోగారావు లిబియా నుంచి భారత్ వచ్చేందుకు ట్రిపోలీ ఎయిర్ పోర్టుకు వచ్చే క్రమంలో కనపించకుండా పోయారు. దాంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

ఈ విషయం తెలుసుకున్న టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ విషయాన్ని పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించారు. వారి ఆచూకీ కోసం చర్యలు తీసుకోవాలంటూ ఆయన కేంద్రానికి లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలో, లిబియాలోని భారత దౌత్యాధికారులు ఎంతో శ్రద్ధ తీసుకుని తెలుగు వారిని కిడ్నాపర్ల చెర నుంచి విడిపించారు.

శ్రీకాకుళం వ్యక్తులతో పాటు యూపీ, బీహార్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన మరో నలుగురు కూడా కిడ్నాప్ కు గురయ్యారు. లిబియాలోని భారత దౌత్య అధికారులు తీవ్ర ప్రయత్నాల అనంతరం ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత బందీలకు విముక్తి కల్పించారు.

More Telugu News