RGV: రాంగోపాల్ వర్మ ఆఫీస్ కు వచ్చి ధర్నాకు దిగిన ‘దిశ’ తండ్రి

  • ‘దిశ.. ఎన్‌కౌంటర్’ సినిమా విడుదల ఆపాలని డిమాండ్
  • ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన దిశ తండ్రి
  • నవంబరు 26న విడుదల చేయడానికి వర్మ సిద్ధం
disha father protests at varma Office

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం, నిందితుల ఎన్‌కౌంటర్‌‌ను ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘దిశ ఎన్‌కౌంటర్’ పేరిట సినిమా తీస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలను ఆపాలని దిశ తండ్రి ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇప్పటికే వాదనలు జరిగాయి. మరోవైపు, నిర్భయ అత్యాచారం తర్వాత జరిగిన అనేక కేసుల ఆధారంగా తాను కల్పిత  కథతో ఈ సినిమా తీస్తున్నానని వర్మ అన్నారు. నవంబరు 26న విడుదల చేయడానికి నిర్ణయం తీసుకున్నారు.

వర్మ వెనక్కి తగ్గకపోవడంతో దిశ తండ్రి ధర్నాకు దిగాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా విడుదల నిలిపేయాల్సిందేనంటూ ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని రాం గోపాల్‌ వర్మ కార్యాలయానికి వచ్చి, దాని ఎదుటే ఆయన ధర్నాకు దిగారు. సోషల్ మీడియాలో వస్తోన్న కామెంట్లు తమను కలిచి వేస్తున్నాయని ఆయన అన్నారు. కాగా, ఈ సినిమా విడుదల విషయంలో కోర్టు చెప్పినట్లు నడుచుకుంటామని ఇప్పటికే నిర్మాత నట్టికుమార్ తెలిపిన విషయం తెలిసిందే.

More Telugu News