రాంగోపాల్ వర్మ ఆఫీస్ కు వచ్చి ధర్నాకు దిగిన ‘దిశ’ తండ్రి
- ‘దిశ.. ఎన్కౌంటర్’ సినిమా విడుదల ఆపాలని డిమాండ్
- ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన దిశ తండ్రి
- నవంబరు 26న విడుదల చేయడానికి వర్మ సిద్ధం
వర్మ వెనక్కి తగ్గకపోవడంతో దిశ తండ్రి ధర్నాకు దిగాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా విడుదల నిలిపేయాల్సిందేనంటూ ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని రాం గోపాల్ వర్మ కార్యాలయానికి వచ్చి, దాని ఎదుటే ఆయన ధర్నాకు దిగారు. సోషల్ మీడియాలో వస్తోన్న కామెంట్లు తమను కలిచి వేస్తున్నాయని ఆయన అన్నారు. కాగా, ఈ సినిమా విడుదల విషయంలో కోర్టు చెప్పినట్లు నడుచుకుంటామని ఇప్పటికే నిర్మాత నట్టికుమార్ తెలిపిన విషయం తెలిసిందే.