leopard: హైదరాబాద్ లో తిరుగుతోన్న చిరుతను ఎట్ట‌కేల‌కు పట్టుకున్న సిబ్బంది

  • కొన్ని నెలలుగా ముప్పుతిప్పలు పెడుతోన్న చిరుత
  • మొన్న అర్ధరాత్రి రాజేంద్ర‌న‌గ‌ర్ లో కలకలం
  • రెండు లేగ దూడ‌ల‌ను చంపిన వైనం
  • ఎరవేసి గత అర్ధరాత్రి పట్టుకున్న సిబ్బంది
workers traps leopard in hyderabad

హైద‌రాబాద్‌ శివారులో కొన్ని నెలలుగా ఓ చిరుత అలజడి రేపుతోన్న విషయం తెలిసిందే. మొన్న అర్ధరాత్రి రాజేంద్ర‌న‌గ‌ర్ వాలంత‌రి రైస్ రిసెర్చ్ సెంట‌ర్ స‌మీపంలోనూ చిరుత రెండు లేగ దూడ‌ల‌ను చంపడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ విషయంపై స్థానికులు పోలీసులు, అట‌వీశాఖ సిబ్బందికి స‌మాచారం అందించడంతో ఆ చిరుత కోసం వెతికారు.

చిరుత తిరిగిన ప్రాంతాన్ని పరిశీలించి బోన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, చనిపోయిన దూడలను ఎరగా అక్కడ ఉంచారు. దీంతో గత అర్ధరాత్రి ఆ చిరుత పశువుల పాక వద్దకు వచ్చి అటవీ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కింది. ఎట్టకేలకు చిరుత చిక్కడంతో తమకు ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు.  చిరుతను పట్టుకున్న అనంతరం అటవీశాఖ అధికారులు దాన్ని జూపార్కుకు తీసుకెళ్లారు.

More Telugu News