హత్రాస్ బాధిత కుటుంబం ఇంటి వద్ద 60 మంది పోలీసులతో పహారా
- బాధిత కుటుంబం, సాక్షులకు పోలీసుల భద్రత
- సీసీ కెమెరాల ఏర్పాటు
- అవసరమైతే గ్రామంలో కంట్రోల్ రూమ్
బాధిత కుటుంబంతోపాటు ఈ కేసులో సాక్షులుగా ఉన్న వారికి పోలీసులు షిఫ్టుల వారీగా భద్రత కల్పిస్తారని హత్రాస్ ఎస్పీ వినీత్ జైశ్వాల్ తెలిపారు. బాధిత కుటుంబాన్ని కలిసి పరామర్శించే వారి కోసం ప్రత్యేకంగా ఓ రిజస్టర్ను కూడా పెట్టినట్టు చెప్పారు. డీఐజీ షాలాభ్ మాథుర్ను లక్నో నుంచి హత్రాస్కు నోడల్ అధికారిగా పంపినట్టు అధికారులు తెలిపారు.