ఈ యూటర్న్ లు చూసి ఊసరవెల్లులు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి: బుద్ధా
- చంద్రబాబు ఊసరవెల్లులను సిగ్గుపడేలా చేస్తున్నారన్న విజయసాయి
- కేసుల కోసం కాళ్లు నాకుతున్నారన్న బుద్ధా
- ప్రజలు పాతాళంలోకి పాతేస్తారంటూ వ్యాఖ్యలు
కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని ఎన్నికల ముందు తొడలు చరిచి, ఇప్పుడు కేసుల కోసం మెడలు వంచుకుని కాళ్లు నాకుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు. హోదా అంశం తలుచుకుంటేనే జగన్ కు చంచలగూడ జైలు గుర్తుకొచ్చి తడిసిపోతోందని వ్యంగ్యం ప్రదర్శించారు. ఈ యూటర్న్ లు చూసి ఊసరవెల్లులు ఆత్మహత్య చేసుకుంటున్నాయని బుద్ధా వ్యాఖ్యానించారు. ప్రజలు మిమ్మల్ని పాతాళం కంటే లోపల పాతేయడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.