Nobel Prize: రసాయనశాస్త్రంలో ఈ ఏడాది ఇద్దరు మహిళా శాస్త్రవేత్తలను వరించిన నోబెల్ ప్రైజ్

  • దౌడ్నా, చార్పెంటీర్ లకు కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్
  • జన్యుకత్తెర విధానానికి రూపకల్పన చేసిన శాస్త్రవేత్తలు
  • అత్యంత కచ్చితత్వంతో జన్యుమార్పిడికి అవకాశం
Two women wins this year Nobel Prize

వివిధ శాస్త్ర రంగాల్లో వరుసగా నోబెల్ ప్రైజులు ప్రకటిస్తున్నారు. గత రెండ్రోజులుగా వైద్య, భౌతిక శాస్త్ర రంగాల్లో విజేతలను ప్రకటించిన ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తాజాగా రసాయనశాస్త్రంలో అవార్డుకు ఎంపికైన వారి పేర్లను వెల్లడించింది. అమెరికాకు చెందిన జెన్నిఫర్ ఎ దౌడ్నా, ఇమ్మాన్యుయెల్లే చార్పెంటీర్ 2020కి గాను కెమిస్ట్రీలో నోబెల్ విజేతలుగా నిలిచారు. జన్యువులో మార్పులు, చేర్పులు చేసేందుకు వీలుగా వీరు ఓ కొత్త విధానానికి రూపకల్పన చేశారు.  

ఓ జీవి డీఎన్ఏ జన్యుపటాన్ని సవరించడమే కాకుండా, దాన్ని నియంత్రించేందుకు జీనోమ్ ఎడిటింగ్ విధానాన్ని ఆవిష్కరించారు. ఒక విధంగా చెప్పాలంటే ఓ జీవి డీఎన్ఏను మార్చడం ఇకపై ఎంతో సులువు. అది జంతువైనా, మొక్క అయినా సరే... అత్యంత కచ్చితత్వంతో తాము కోరుకున్న జన్యువును ఎంతమేర మార్చవచ్చో అంతమేర మాత్రమే మార్పులు చేసుకోవడం సాధ్యమవుతుంది.

More Telugu News