కేరళలో ఓనమ్ సందర్భంగా ఒక్కసారిగా కేసులు పెరిగాయి... పండుగ సమయాల్లో జాగ్రత్తగా ఉండాలి: ఈటల
- త్వరలో బతుకమ్మ, దసరా సీజన్
- ప్రజలు ఇళ్లలోనే వేడుకలు జరుపుకోవాలని సూచన
- ప్రభుత్వ నియమావళి పాటించాలని హితవు
కేరళలో ఓనమ్ పండుగ సందర్భంగా ప్రజలు భారీ సంఖ్యలో వేడుకల్లో పాల్గొన్నారని, దాంతో అక్కడ ఒక్కసారిగా కరోనా కేసుల్లో పెరుగుదల కనిపించిందని ఈటల వెల్లడించారు. అందుకే, బతుకమ్మ, దసరా సమయాల్లో ప్రభుత్వ నియమావళి మేరకు నడచుకోవాలని, ప్రభుత్వ సూచనలు పెడచెవినపెడితే కేరళ తరహా సమస్యలు తప్పవని హెచ్చరించారు.