ప్రకాశ్ రాజ్ చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన త్రిష
- ఉత్సాహంగా సాగుతున్న గ్రీన్ ఇండియా చాలెంజ్
- త్రిషను నామినేట్ చేసిన ప్రకాశ్ రాజ్
- రెండు మొక్కలు నాటానని వెల్లడించిన త్రిష
తాజాగా, ప్రకాశ్ రాజ్ చాలెంజ్ ను అంగీకరించిన త్రిష తన నివాసంలో మొక్కలు నాటి ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ పర్యావరణ కార్యక్రమంలో భాగంగా తాను రెండు మొక్కలు నాటానని త్రిష వెల్లడించారు. అంతేకాదు, అభిమానులందరూ ఈ చాలెంజ్ లో పాలుపంచుకుని తమవంతుగా మొక్కలు నాటి హరిత భారతం కోసం కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.