నిర్మాత అశ్వనీదత్ పిటిషన్పై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు
- ల్యాండ్ పూలింగ్ లో 39 ఎకరాలు ఇచ్చిన అశ్వనీదత్
- తన భూమికి 4 రెట్లు అధికంగా చెల్లించాలంటూ పిటిషన్
- ప్రభుత్వ తీరుతో తమ భూముల విలువ పడిపోయిందని వ్యాఖ్య
ఏపీ రాజధాని కోసం గత ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్ పూలింగ్ కింద తాను 39 ఎకరాల భూమిని ఇచ్చానని.. అప్పట్లో ఎకరం భూమి రూ. 1.54 కోట్లుగా ఉందని తన పిటిషన్ లో అశ్వనీదత్ తెలిపారు. ఆ భూమికి సమానమైన విలువ కలిగిన భూమిని అమరావతిలో ఇస్తామని సీఆర్డీయే తనతో ఒప్పందం చేసుకుందని... ప్రస్తుత ప్రభుత్వం రాజధానిని వేరే చోటికి తరలించాలని భావిస్తోందని చెప్పారు. ప్రస్తుతం ఇక్కడి భూమి ఎకరం రూ. 30 లక్షలు కూడా చేయడం లేదని అన్నారు. భూసేకరణ కింద తన భూమికి 4 రెట్లు రూ. 210 కోట్లు చెల్లించిన తర్వాతే ప్రభుత్వం కానీ, ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా కానీ నిర్మాణాలు చేపట్టుకోవాలని పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై ఈరోజు హైకోర్టు విచారణ చేపట్టింది.