ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి ప్రొఫెసర్ కె.నాగేశ్వర్.. స్వయంగా ప్రకటన
- మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బరిలోకి
- 2007, 2009లలో ఇదే నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలుపు
- ఓటరు నమోదుకు నేటి నుంచి దరఖాస్తుల స్వీకారం
2007, 2009లలో ఇదే నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన ఆయన 2014 వరకు మండలికి ప్రాతినిధ్యం వహించారు. కాగా, మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఓటరు నమోదుకు దరఖాస్తుల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. వచ్చే నెల ఆరో తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. www.ceotelangana.nic.in లోనూ నమోదు చేసుకోవచ్చని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి పంకజ తెలిపారు.