అత్యాచార నిందితులపై కఠిన చర్యలు తీసుకోండి: యోగికి మోదీ ఫోన్
- యూపీలో యువతిపై దారుణ అత్యాచారం
- ఢిల్లీలో చికిత్స పొందుతూ యువతి మృతి
- ఎవరినీ వదలొద్దన్న మోదీ
ఈ ఘటన దేశ వ్యాప్తంగా ఆగ్రహజ్వాలలను రగిల్చింది. ఈ నేపథ్యంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు ప్రధాని మోదీ ఈ రోజు ఫోన్ చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని యోగిని ఆదేశించారు. వారిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టొద్దని అన్నారు.
మోదీ ఫోన్ చేసిన విషయాన్ని యోగి వెల్లడించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని ఆదేశించారని చెప్పారు. దీనిపై ముగ్గురు అధికారులతో ఓ ప్యానెల్ ఏర్పాటు చేశామని... వారం రోజుల్లో ఈ ప్యానెల్ రిపోర్టు సమర్పిస్తుందని తెలిపారు.