temples: హిందూ దేవాలయాలపై దాడుల నేపథ్యంలో హోమం చేస్తున్నాం: శ్రీనివాసానంద

  • కొన్ని నెలలుగా హిందూ దేవాలయాల్లో అపచారం 
  • ఈ తీరు దేశానికి, ఆంధ్రప్రదేశ్‌కు మంచిది కాదు
  • ఆలయాలను మనం కాపాడాలి
  • అవి మనల్ని కాపాడతాయి
srinivasananda on attacks on temples in ap

ఆంధ్రప్రదేశ్‌లో హిందూ దేవాలయాలపై జరుగుతోన్న దాడుల పట్ల  ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీ శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో ఆయన ఆధ్వర్యంలో కాసేపట్లో శాంతి యజ్ఞం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని నెలలుగా హిందూ దేవాలయాల్లో అపచారం జరుగుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తీరు దేశానికి, ఆంధ్రప్రదేశ్‌కు మంచిది కాదని ఆయన చెప్పారు.

ఈ ఘటనపై దేవాలయ ధర్మాదాయ శాఖ అరిష్ట నివారణ శాంతి హోమాలు చేయాలని, అయితే ఈ పని చేయట్లేదని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో తామే ఈ హోమం చేస్తున్నామని వివరించారు. ఆలయాలను మనం కాపాడితే అవి మనల్ని కాపాడతాయని చెప్పుకొచ్చారు. ఆలయాలపై దాడులకు పాల్పడుతున్న వారిని శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. దాడులు జరుగుతున్నప్పటికీ ఆ విషయాలపై స్పందించకుండా మౌనం వహిస్తోన్న ప్రజాప్రతినిధులకు దేవుడు మంచి బుద్ధి ఇవ్వాలని ఆయన ఆకాంక్షించారు.

More Telugu News