జడ్జి రామకృష్ణ సోదరుడిపై దాడి... మీకెందుకింత అహం అంటూ లోకేశ్ ఆగ్రహం!
- చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో ఘటన
- సరుకులు కొంటున్న రామచంద్రపై దుండగుల దాడి
- దాడిని తీవ్రంగా ఖండించిన లోకేశ్
"ఎంతమంది దళిత బిడ్డలను బలితీసుకుంటారు జగన్ గారూ? దళితులపై మీ దమనకాండ ఆపరా? వైసీపీ చెత్తపాలనలో దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే చంపేస్తారా?" అంటూ ప్రశ్నించారు. జడ్జి రామకృష్ణ సోదరుడిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు లోకేశ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. జడ్జి రామకృష్ణ కుటుంబాన్ని వెంటాడి వేధిస్తున్న వైసీపీ నేతలను, దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.