విజయదశమి రోజున 'ధరణి' పోర్టల్ ప్రారంభం: కేసీఆర్
- సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ అన్నింటినీ సిద్దం చేయండి
- అధికారులకు కొత్త రెవెన్యూ చట్టంపై శిక్షణ ఇవ్వండి
- దసరాలోగా అన్ని పనులు పూర్తి కావాలి
కొత్త రెవెన్యూ చట్టానికి అసెంబ్లీ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. కొత్త రెవెన్యూ చట్టంతో వీఆర్వో వ్యవస్థ రద్దుకాబోతోంది. ల్యాండ్ రికార్డులను ధరణి పోర్టల్ లో ఫీడ్ చేయనున్నారు. ఇకపై ఏక కాలంలోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ జరిగిపోనున్నాయి. ఈ పోర్టల్ ఆధారంగానే యాజమాన్య హక్కుల పర్యవేక్షణ, బదిలీ జరగనుంది. యాజమాన్య హక్కులను బదిలే చేసే అధికారాన్ని రిజిస్ట్రేషన్ శాఖకు కల్పించారు.