Kishan Reddy: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభించిన కిషన్ రెడ్డి, కేటీఆర్

  • దేశంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జి
  • జూబ్లీహిల్స్-మాదాపూర్ మధ్య తగ్గనున్న ట్రాఫిక్ సమస్యలు
  • శని, ఆదివారాల్లో బ్రిడ్జిపై వాహనాలు నిషేధం
Kishan Reddy and KTR inaugurates Durgam Cheruvu cable bridge

హైదరాబాదులో ట్రాఫిక్ సమస్యల తొలగింపునకు తీసుకుంటున్న అనేక చర్యల్లో కీలక ప్రాంతాల్లో ఫ్లైఓవర్ లు, వంతెనలు నిర్మించడం ఓ ప్రాధాన్యతాంశం. ఈ క్రమంలో నిర్మించిందే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్మించిన ఈ వంతెనను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీఆర్ఎస్ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

కాగా, ఈ బ్రిడ్జి దేశంలోనే అతి పెద్ద కేబుల్ బ్రిడ్జిగా పేర్కొంటున్నారు. ఈ వంతెన నిర్మాణంతో జూబ్లీహిల్స్-మాదాపూర్ మధ్య ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని భావిస్తున్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా రంగురంగుల విద్యుద్దీప కాంతులతో వంతెన జిగేల్మంటోంది. అయితే ఈ బ్రిడ్జిపై శని, ఆదివారాల్లో మాత్రం వాహనాలను అనుమతించరు. ఈ రెండు రోజులు పర్యాటకులు కాలినడకన బ్రిడ్జి అందాలు ఆస్వాదించవచ్చు.

ఈ వంతెన ముఖ్యాంశాలు

  • దీని పొడవు 754.38 మీటర్లు
  • దుర్గం చెరువుకు ఇరువైపులా 20 మీటర్ల ఎత్తుతో వంతెన నిర్మాణం
  • రూ.184 కోట్ల వ్యయంతో నిర్మాణం
  • ఆస్ట్రియా నుంచి ప్రత్యేకంగా కేబుళ్ల దిగుమతి
  • బ్రిడ్జి నిర్మాణంలో 13 ఫౌండేషన్లు, కేవలం రెండు పిల్లర్లు
  • నిర్మాణంలో పాలుపంచుకున్న 8 దేశాల ఇంజినీర్లు
  • వంతెనను నిర్మించిన ఎల్ అండ్ టీ
  • ఈ కేబుల్ బ్రిడ్జితో జూబ్లీహిల్స్ నుంచి మైండ్ స్పేస్, గచ్చిబౌలికి తగ్గిన దూరం
  • బ్రిడ్జిపై మొత్తం 40 వేల ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు .

.

  • Loading...

More Telugu News