మేం టీఆర్ఎస్ ప్రభుత్వంలా కాదు... హరీశ్ రావు వ్యాఖ్యలకు బాలినేని కౌంటర్
- రూ.4 వేల కోట్లకు ఆశ పడ్డారంటూ హరీశ్ వ్యాఖ్యలు
- కేంద్రంతో సఖ్యతగా ఉంటే తప్పేంటన్న బాలినేని
- నిధులను ప్రజల కోసం ఉపయోగిస్తామని స్పష్టీకరణ
కేంద్రం ఇచ్చే రూ.4 వేల కోట్ల నిధులను ప్రజా సంక్షేమం కోసమే ఉపయోగిస్తాం తప్ప, వాటిని తమ జేబుల్లో వేసుకోబోమని స్పష్టం చేశారు. అయినా టీఆర్ఎస్ ప్రభుత్వంలా కేంద్రంతో ఒకరోజు మంచిగా ఉండడం, మరో రోజు గొడవ పడడం తమ నైజం కాదని చురక అంటించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో సఖ్యతతో ఉండడం తప్పెలా అవుతుందని బాలినేని ప్రశ్నించారు. ఉచిత విద్యుత్ బిల్లులకు సంబంధించి డిస్కంలకు చెల్లించవలసిన మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాలోనే జమ చేస్తామని, ఇందులో అనుమానించాల్సింది ఏముందని అన్నారు.