విషమంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఆరోగ్యం
- అస్వస్థతతో బుధవారం ఆసుపత్రిలో చేరిన సిసోడియా
- డెంగీ తోడవడంతో పడిపోతున్న ప్లేట్లెట్లు
- ఎల్ఎన్జేపీ నుంచి మ్యాక్స్ ఆసుపత్రికి తరలింపు
జ్వరంతోపాటు ఆక్సిజన్ స్థాయులు తగ్గిపోయిన స్థితిలో సిసోడియా బుధవారం ఆసుపత్రిలో చేరినట్టు ఎల్ఎన్జేపీ వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయనను ఎల్ఎన్జేపీ నుంచి సాకేత్లోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. కాగా, అరవింద్ కేజ్రీవాల్ కేబినెట్ మంత్రులలో కరోనా సోకిన వారిలో సిసోడియా రెండోవారు. జూన్లో మంత్రి సత్యేంద్ర జైన్ కరోనాతో ఆసుపత్రిలో చేరగా అదే నెల 26న కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.