ఆ కట్టుబాట్లు పాటిస్తే జగన్ చరిత్రలో నిలిచిపోతారు: కేశినేని నాని
- తిరుమల డిక్లరేషన్ పై తీవ్ర చర్చ
- నిన్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్
- కట్టుబాట్లు పాటించకపోతే చరిత్రహీనులేనన్న కేశినేని
ఏ మతానికి అయినా, ఏ కులానికి అయినా, ఏ ప్రాంతానికి అయినా కొన్ని ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు, నియమ నిబంధనలు ఉన్నాయని, అవి తరతరాలుగా వస్తున్నాయని కేశినేని నాని తెలిపారు. అయితే, అత్యున్నత స్థాయిలో ఉన్నవారు వాటిని పాటిస్తే ఒక గొప్ప ఒరవడి సృష్టించిన వారిగా చరిత్రలో నిలిచిపోతారని, పాటించకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారని సీఎం జగన్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.
సీఎం జగన్ నిన్న బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నప్పటి ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఈ మేరకు సీఎంవో చేసిన ట్వీట్ ను కేశినేని రిట్వీట్ చేశారు.