భారత్ దెబ్బకు.. తూర్పు లడఖ్‌ లో డ్యూటీ అంటే భయంతో ఏడ్చేస్తున్న చైనా సైనికులు.. వీడియో ఇదిగో!

PLA recruits seen sobbing en route to Ladakh border
  • వివరాలు తెలిపిన తైవాన్ మీడియా 
  • ఈ నెల 15న చైనా సైన్యంలో కొత్తగా చేరిన యువత
  • తమ సైనిక గీతం పాడుతూ భయంతో ఏడుపు
సరిహద్దుల వద్ద భారత్‌, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. చైనా చర్యలకు భారత్‌ దీటుగా సమాధానం ఇస్తోంది. ఈ నేపథ్యంలో చైనా సైనికులు భయపడిపోతున్నట్లు తెలుస్తోంది. సరిహద్దుల్లో విధులకు వెళ్లే చైనా సైనికులు భయపడుతున్నారని తైవాన్ మీడియా ఓ కథనాన్ని ప్రచురించింది. సరిహద్దుల్లో విధులకు వెళ్తే అక్కడ నుంచి తిరిగి ఇంటికివెళ్తామా? అన్న ఆందోళన వారిలో నెలకొందని పేర్కొంది.

వారు పిరికితనంతో ఎలా వ్యవహరిస్తున్నారో తెలిపేలా ఓ వీడియో బయటకు వచ్చింది.  ఈ వీడియోను పాకిస్థాన్ హాస్యనటుడు జమీద్ హమీద్ కూడా ఇటీవలే పోస్ట్ చేశారు. ఈ నెల 15న హుబే ప్రావిన్సులో సైన్యంలో కొత్తగా చేరిన చైనా యువతకు తూర్పు లడఖ్‌‌ సరిహద్దుల వద్ద పోస్టింగ్ ఇచ్చారు. దీంతో వారు బస్సులో వెళ్తూ తమ సైనిక గీతం పాడుతూ ఏడ్చారు. ఈ వీడియోను ఒకరు తీసి పోస్ట్ చేశారు. ఇదే వీడియోను తైవాన్‌ మీడియా కూడా ప్రసారం చేస్తోంది. తూర్పు లడఖ్‌లో భారత సైనికులను ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయంతో వారు ఏడ్చారని తెలిపింది.
Go Back to Shorts
China
India
Ladakh

More Telugu News