కరోనాతో కన్నుమూసిన కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి సురేశ్ అంగడి
- ఎయిమ్స్లో చికిత్స పొందుతూ మృతి
- కరోనాతో మృతి చెందిన తొలి కేంద్ర మంత్రి
- వరుసగా నాలుగుసార్లు పార్లమెంటుకు ఎన్నిక
2001 నుంచి 2004 వరకు బీజేపీ బెళగావి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన సురేశ్ 2004లో తొలిసారి లోక్సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009, 2014లోనూ ఎన్నికయ్యారు. 2019లో నాలుగోసారి ఎన్నికైన ఆయనను రైల్వే శాఖ సహాయమంత్రి పదవి వరించింది. సురేశ్ మృతికి ప్రధాని నరేంద్రమోదీ, మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటకకు చెందిన బీజేపీ నాయకురాలు శోభ కరంద్లాజె తదితరులు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.