చంద్రబాబుకు పెట్టినట్టే మోదీకి కూడా మీటర్లు పెట్టాలి: హరీశ్ రావు
- వ్యవసాయ బోర్లకు మోటార్లు పెట్టాలనుకున్న చంద్రబాబును ఆంధ్రకు తరిమేశాం
- కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక బిల్లులు తీసుకొస్తోంది
- రైతుల కోసం ఆలోచించే ఏకైక సీఎం కేసీఆర్
రాష్ట్రంలో రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉచిత కరెంటు ఇస్తున్నారని... కానీ, మీటర్లు బిగించి రైతుల నుంచి ముక్కుపిండి బిల్లులు వసూలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని హరీశ్ అన్నారు. దేశంలో రైతుల గురించి ఆలోచించే ఏకైక మఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పారు. కరోనా సమయంలో ప్రభుత్వానికి ఆదాయం రాకపోయినా... రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రైతుబంధు సాయాన్ని ముందుగానే బ్యాంకుల్లో వేశామని తెలిపారు.