Vizag: పాలనా రాజధాని విశాఖకు తరలి వెళ్లినా, వెళ్లకపోయినా అక్కడ గెస్ట్ హౌస్ కడతాం: హైకోర్టులో అడ్వొకేట్ జనరల్

  • అమరావతి రైతుల పిటిషన్లపై హైకోర్టు విచారణ
  • గెస్ట్ హౌస్ నిర్మాణంపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం
  • రైతుల తరపున వాదించిన శ్యామ్ దివాన్
AP govt gives clarity to HC on Vizag guest  house

విశాఖలో సువిశాలమైన గెస్ట్ హౌస్ ను నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. దీంతో పాటు అమరావతి రైతులు వేసిన పిటిషన్లను కూడా ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ తన వాదనను వినిపిస్తూ.... ఏపీ పాలనా రాజధాని విశాఖకు తరలి వెళ్లినా, వెళ్లకపోయినా అక్కడ గెస్ట్ హౌస్ ను నిర్మిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు, రైతుల తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ శ్యామ్ దివాన్ వాదనలను వినిపిస్తున్నారు.

More Telugu News