బ్రేకింగ్... భారీ ఎన్ కౌంటర్ నుంచి తప్పించుకున్న మావో నేత భాస్కర్... వేట మొదలు!
- ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన
- గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న కూంబింగ్
- ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోల మృతి
ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా మావోల కీలక నేత భాస్కర్ తప్పించుకున్నట్టు తెలుస్తోంది. ఆ వెంటనే విషయం తెలుసుకున్న అదనపు బలగాలు, ఆ ప్రాంతానికి చేరుకుని, అడవిలోని అణువణువునూ జల్లెడ పడుతున్నాయి. కాగా, మృతి చెందిన మావోయిస్టులు కోయా జంగు అలియాస్ వర్గీస్, కంచి లింగవ్వగా గుర్తించామని అధికారులు వెల్లడించారు. ఎన్ కౌంటర్ జరిగిన స్థలంలో పోలీసులు రెండు ఏకే 47 తుపాకులతో పాటు, మావోల డంప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలావుండగా, గడచిన రెండు మూడు నెలలుగా ఈ ప్రాంతంలో మావోల నేత భాస్కర్ కోసం ప్రత్యేక దళాలు కూంబింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. ఈ ఘటన తరువాత, ఎలాగైనా అతన్ని పట్టుకోవాలన్న లక్ష్యంతో మరిన్ని బలగాలతో సెర్చ్ ఆపరేషన్ ను ప్రారంభించినట్టు తెలుస్తోంది.