అమరావతి అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి: లోక్సభలో గల్లా జయదేవ్
- అమరావతిలో రూ. 41 వేల కోట్ల పనులు జరిగాయి
- రాజధాని మార్పుతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు
- అమరావతి అంశాన్ని కేంద్ర జాబితాలో చేర్చాలి
ఏపీ రాజధాని అంశాన్ని కేంద్ర జాబితాలో చేర్చాలని జయదేవ్ డిమాండ్ చేశారు. అమరావతిలో రూ. 41 వేల కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని చెప్పారు. రాజధానిని మార్చడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. అమరావతి అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. ఆర్టికల్ 248 ప్రకారం కేంద్ర, రాష్ట్ర జాబితాల్లో లేని అంశాలపై పార్లమెంటు ద్వారా చట్టం చేయవచ్చని తెలిపారు.