Hyderabad: మాదాపూర్ డీఎస్ఐని కబళించిన కరోనా

  • పది రోజుల క్రితం ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన అబ్బాస్ అలీ
  • పరిస్థితి విషమించడంతో నిన్న ఉదయం కన్నుమూత
  • పోలీసుల సంతాపం
Madhapur DSI Died with Corona virus

హైదరాబాద్‌లో కరోనాకు మరో పోలీసు అధికారి బలయ్యారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో డీఎస్ఐగా పనిచేస్తున్న 56 ఏళ్ల అబ్బాస్ అలీ కరోనాతో కన్నుమూశారు.

బోరబండలో నివసిస్తున్న ఆయన ఇటీవల కరోనా బారినపడ్డారు. పది రోజుల క్రితం మాదాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో నిన్న ఉదయం కన్నుమూశారు. అబ్బాస్ అలీ మృతికి పోలీసులు సంతాపం తెలిపారు.

More Telugu News