కండిషనల్ బెయిల్ మీద వచ్చి.. కోర్టులనే విమర్శిస్తున్నారు: వర్ల రామయ్య
- న్యాయ వ్యవస్థ పారదర్శకంగా వ్యవహరించడం లేదన్న విజయసాయి
- సీబీఐ, ఈడీ కేసుల్లో విజయసాయి ప్రధాన ముద్దాయి అన్న వర్ల
- బెయిల్ రద్దు చేయాలని వ్యాఖ్య
టీడీపీ నేత వర్ల రామయ్య ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 11 సీబీఐ కేసులు, 5 ఈడీ కేసుల్లో ప్రధాన ముద్దాయిగా ఉన్న వ్యక్తి విజయసాయి అని పేర్కొన్నారు. ఈ కేసుల్లో కండిషనల్ బెయిల్ పై బయటకు వచ్చిన విజయసాయి... ఏకంగా పార్లమెంటులో న్యాయ వ్యవస్థను కించపరిచే వ్యాఖ్యలు చేశారని... ఇలా వ్యవహరించినందుకు అత్యున్నత న్యాయస్థానం అతని బెయిల్ రద్దు చేసి, నోరు అదుపులో పెట్టుకోమని చెప్పొద్దూ అని అన్నారు.