శివబాలాజీ ఫిర్యాదుపై స్పందించిన మానవహక్కుల కమిషన్
- ఫీజు కోసం స్కూలు యాజమాన్యం వేధిస్తోందని శివబాలాజీ ఫిర్యాదు
- ఆన్ లైన్ క్లాసుల నుంచి అర్ధాంతరంగా తొలగించారని ఆరోపణ
- విచారణ జరపాలని డీఈవోను ఆదేశించిన హెచ్చార్సీ
ఫీజులు తగ్గించాలని అడిగితే తన కుమారుడిని ఆన్ లైన్ క్లాసుల నుంచి అర్ధాంతరంగా తొలగించారని ఫిర్యాదులో శివబాలాజీ పేర్కొన్నారు. చాలా మంది తల్లిదండ్రులను ఇలాగే ఇబ్బంది పెడుతున్నారని... అయితే వారు బయటకు చెప్పుకోవడానికి భయపడుతున్నారని తెలిపారు. శివబాలాజీ ఫిర్యాదుపై మానవహక్కుల కమిషన్ స్పందించింది. సదరు పాఠశాలపై సమగ్ర విచారణ జరిపి, రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని డీఈఓకి నోటీసులు పంపింది.