pib: 80,000 మంది భారత సైనికులు సెలవులు పెడుతున్నారంటూ.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం

  • భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు 
  • ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం
  • భారతీయ సైనికులు సిక్‌లీవులపై వెళుతున్నారని వార్త
  • అందులో నిజం లేదని తెలిపిన పీఐబీ
pib gives clarity on indian army leaves

భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వేలాది మంది భారతీయ సైనికులు సిక్‌లీవులపై వెళుతున్నారని పేర్కొంటూ, సామాజిక మాధ్యమాల్లో కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాన్ని తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ)  సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఈ వార్తలు అవాస్తవమని తెలిపింది.

లడఖ్‌ కేంద్రంగా ఇరు దేశాల మధ్య ఘర్షణలు, కాల్పులు చోటుచేసుకున్న నేపథ్యంలో తొలిసారి భారత్‌కు చెందిన 80,000 మందికి పైగా  సైనికులు సిక్‌లీవులకు దరఖాస్తు చేసుకున్నారని సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న ఓ తప్పుడు వార్తను పీఐబీ పోస్ట్ చేసి, అందులో నిజం లేదని తెలిపింది. మన సైనికులు సెలవుకు దరఖాస్తు చేయలేదని సైనిక వర్గాలు కూడా తెలిపాయి.

ఇటువంటి అసత్య వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నాయి. కాగా, ఎన్నడూ లేని విధంగా భారత్‌-చైనా సరిహద్దుల వద్ద గల్వాన్‌ లోయలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా కుయుక్తులను భారత్ సమర్థంగా ఎదుర్కొంటోంది.

More Telugu News