Budda Venkanna: పెంచిన పన్నంతా ఇడుపులపాయ నేలమాళిగల్లోంచి తీసి కడుతున్నారా?: బుద్ధా వెంకన్న

  • ట్విట్టర్ లో విజయసాయి, బుద్ధా మధ్య మాటలయుద్ధం
  • చార్జీలు, ధరలు పెంచేశారన్న బుద్ధా
  • జగన్ దోపిడీ, విజయసాయి గారడీ అంటూ
Budha Venkanna questions Vijayasai Reddy

ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నల మధ్య నిత్యం మాటల యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఇటీవలే విజయసాయి, బుద్ధా కరోనా బారినపడిన నేపథ్యంలో వాగ్బాణాలకు కాస్త విరామం వచ్చినప్పటికీ మళ్లీ జోరు షురూ అయింది.

తాజాగా, విజయసాయిరెడ్డి టీడీపీ అగ్రనేత లోకేశ్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయగా, బుద్ధా వెంటనే అందుకున్నారు. దోపిడీ నందు జగన్ దోపిడీ, విజయసాయిరెడ్డి గారడీ వేరయా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

"ఆర్టీసీ చార్జీలు పెంచాం... ప్రయాణికుడిపై భారం పడదంటావ్. ఇసుక ధర పెంచాం... ఇల్లు కట్టుకునేవాడిపై భారం పడదంటావ్. నేచురల్ గ్యాస్ ధర పెంచాం... భారం ప్రజలపై ఉండదంటావ్. మీటర్లు పెడుతున్నాం... రైతుపై మోత లేదంటావ్. విద్యుత్ ఛార్జీలు పెంచి... షాక్ కొట్టలేదుగా అంటావ్. మద్యం ధరలు పెంచాం... మత్తు ఎక్కదు అంటావ్. మరి పెంచిన పన్నంతా ఇడుపులపాయ నేలమాళిగల్లోంచి తీసి కడుతున్నారా?" అంటూ ప్రశ్నించారు.

More Telugu News