మరోసారి ఎయిమ్స్ లో చేరిన అమిత్ షా!
- గత రాత్రి అలసట, ఆయాసం
- ఆసుపత్రికి తరలించిన కుటుంబీకులు
- పక్షం రోజుల క్రితమే డిశ్చార్జ్
ఆగస్టు 14న గురుగ్రామ్ లోని మేదాంతా నుంచి ఢిశ్చార్జ్ అయిన అమిత్ షా, వైద్యుల సలహా మేరకు తాను మరికొన్ని రోజులు హోమ్ ఐసోలేషన్ లో ఉంటానని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. గత రాత్రి తనకు ఆయాసం వస్తోందని, అలసటగానూ, ఒళ్లు నొప్పులుగానూ ఉన్నాయని చెప్పడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.