KCR: కొత్త రెవెన్యూ చట్టాన్ని సభలో ప్రతిపాదిస్తున్నందుకు సంతోషంగా ఉంది: సీఎం కేసీఆర్

  • అవినీతి అంతం కోసమే నూతన చట్టం అంటూ కేసీఆర్ వ్యాఖ్యలు
  • పేదల బాధలకు ఇది ముగింపు పలుకుతుందని వెల్లడి
  • గత పాలకులు పరిష్కారం చూపలేకపోయారన్న సీఎం
 CM KCR introduces the bill of Telangana new revenue act

తెలంగాణలో అవినీత అంతానికి నూతన రెవెన్యూ చట్టానికి రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కొత్త రెవెన్యూ చట్టం బిల్లును సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీనిపై ఆయన మాట్లాడుతూ, ఈ చట్టాన్ని సభలో ప్రతిపాదిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. పేదలు ఎంతోకాలంగా అనుభవిస్తున్న బాధలకు ఈ చట్టంతో ముగింపు లభిస్తుందని, ఇది చారిత్రక ఘట్టం అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రతి కుటుంబానికి ఈ కొత్త చట్టం వర్తిస్తుందని తెలిపారు.

భూమిని ఉత్పత్తి సాధనంగా గుర్తించినప్పటి నుంచి భూమికి సంబంధించిన సమస్యలు ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయని, గత పాలకులు ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపలేకపోయారని అన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం నవ్య సంస్కరణలతో కూడిన చట్టాన్ని రూపొందించామని వివరించారు.

More Telugu News