Akhil: తన తదుపరి చిత్రంపై అఖిల్ అక్కినేని అధికారిక ప్రకటన

  • సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ తదుపరి చిత్రం
  • నిర్మాతగా వ్యవహరించనున్న అనిల్ సుంకర
  • త్వరలోనే ప్రారంభం కానున్న షూటింగ్
Akkineni Akhil announces his next with Surender Reddy

అక్కినేని వారసుడు అఖిల్  ప్రస్తుతం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తుండగా... అఖిల్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. తాజాగా అఖిల్ తదుపరి చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండగా...  అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని అఖిల్ ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ఈ ప్రాజెక్ట్ తనకు ఎంతో ప్రత్యేకమైనదని చెప్పాడు. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలిపాడు.

More Telugu News