సింగిల్ రన్ తీయడం చేతకాని వ్యక్తి సెంచరీ కొడతానని ప్రగల్భాలు పలికినట్టుంది: అనగాని సత్యప్రసాద్
- వైసీపీ నేతలపై అనగాని విసుర్లు
- పాలన చేతకాకపోతే ఇంట్లో గేములు ఆడుకోవాలని సూచన
- తప్పుడు నిర్ణయాలతో రాష్ట్రాన్ని నాశనం చేయొద్దని హితవు
సీఎం జగన్ కు బెంగళూరు, హైదరాబాద్, తాడేపల్లి ప్రాంతాల్లో మూడు చోట్ల మూడు ఇళ్లు ఉన్నాయని చెప్పి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారా ఏంటి?... లేకపోతే, వైసీపీ జెండాలో మూడు రంగులు ఉన్నాయని మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారా? అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు అమరావతిపై దుష్ప్రచారం చేసేందుకే ఏడాదిన్నర సమయం వృథా చేశారని, మూడు రాజధానుల విషయంలో మిగిలిన మూడేళ్ల సమయం వృథా చేయడం తప్ప ఏమీ చేయలేరని ప్రజలకు కూడా తెలిసిపోయిందని పేర్కొన్నారు.
కోర్టులు గనుక అడ్డుకుని ఉండకపోతే వైసీపీ అనాలోచిత నిర్ణయాలకు రాష్ట్రం నిలువునా మునిగిపోయేదని విమర్శించారు. ఈ మేరకు టీడీపీ నేత అనగాని సత్యప్రసాద్ ఓ ప్రకటన విడుదల చేశారు.