కేసీఆర్ దగాకోరని 11 ఏళ్ల క్రితమే చెప్పా: మంద కృష్ణమాదిగ
- వచ్చే ఎన్నికల్లో ఆయనను ఓడించాలి
- ఏది కట్టాలన్నా కేసీఆర్కు దళితుల భూములే కనిపిస్తున్నాయి
- ఎమ్మెల్యే ఉపేందర్రెడ్డి మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిక
టీఆర్ఎస్ పెద్దల కళ్లు దళితుల భూములపై పడ్డాయని, చంద్రబాబు, ఇందిరాగాంధీ హయాంలో ఇచ్చిన భూములను కేసీఆర్ ఇప్పుడు లాక్కుంటున్నారని ఆరోపించారు. దొరలకు పోయే రోజులు వచ్చాయని, దళితులకు మూడెకరాల భూమి పేరుతో ఓట్లను కొల్లగొట్టి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ దగాకోరని 11 ఏళ్ల క్రితమే చెప్పానన్నారు. వైకుంఠధామాలు, ప్రకృతివనాలు, డంపింగ్ యార్డులు ఇంకా ఏది కట్టాలన్నా ప్రభుత్వానికి తొలుత దళితుల భూములే కనిపిస్తున్నాయని విమర్శించారు.