Udhav Thackeray: దావూద్ ఇబ్రహీం మీతో మాట్లాడాలనుకుంటున్నారు... అజ్ఞాత వ్యక్తి నుంచి సీఎం ఉద్ధవ్ థాకరేకు ఫోన్

  • మహారాష్ట్ర సీఎంకు బెదిరింపు కాల్స్
  • మాతోశ్రీని పేల్చివేస్తామంటూ హెచ్చరికలు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన సిబ్బంది
Threat calls to Maharashtra CM Udhav Thackeray

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేకు మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. ముంబయి బాంద్రాలోని ఉద్ధవ్ థాకరే నివాసం మాతోశ్రీని పేల్చివేస్తామంటూ దుండగులు హెచ్చరించారు. ఈ విధంగా పలు పర్యాయాలు ఫోన్ కాల్స్ వచ్చినట్టు తెలుస్తోంది. గత రాత్రి ఉద్ధవ్ నివాసానికి గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆ వ్యక్తి తాను దుబాయ్ నుంచి దావూద్ ఇబ్రహీం తరఫున మాట్లాడుతున్నానని, దావూద్ సీఎం ఉద్ధవ్ థాకరేతో మాట్లాడాలనుకుంటున్నారని తెలిపాడు. దీనిపై ఉద్ధవ్ నివాస సిబ్బంది బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News