Galla Jayadev: టీడీపీ సర్కారు ఎంత ప్రగతిశీలకంగా వ్యవహరించిందో చెప్పేందుకు ఇదే నిదర్శనం: గల్లా జయదేవ్

  • ఈజ్ ఆఫ్ డూయింగ్... లో ఏపీకి ఫస్ట్ ర్యాంక్
  • టీడీపీ ప్రభుత్వం చర్యలను ప్రస్తావించిన గల్లా జయదేవ్
  • ఆధిక్యతను చేజారనివ్వరాదంటూ వైసీపీ సర్కారుకు సూచన
Galla Jaydev responds after AP got first rank in Ease Of Doing Business fourth time in row

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్-2019లోనూ ఏపీ ప్రథమస్థానంలో నిలవడం పట్ల టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ స్పందించారు. వరుసగా నాలుగోసారి ఏపీ దేశంలోని మిగతా రాష్ట్రాలను అధిగమించి ఈ ఘనత సాధించిందని తెలిపారు. నూతన సంస్కరణలు అమలు చేయడంలో టీడీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ ఎంత ప్రగతిశీలకంగా వ్యవహరించిందో చెప్పడానికి ఇది స్పష్టమైన నిదర్శనం అని తెలిపారు.

రాష్ట్రం ఇవాళ ఈ గొప్పదనం సాధించిందంటే అందుకు కారణం టీడీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలేనని స్పష్టం చేశారు. పెట్టుబడులకు గమ్యస్థానంలా రాష్ట్రాన్ని మలిచినందుకు లభించిన ప్రతిఫలం అని పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ సర్కారు ఈ ఆధిక్యతను చేజారనీయకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఏదేమైనా, మనం అందరం కోరుకునేది రాష్ట్రం శక్తిమంతం కావాలని, ప్రజలు మెరుగైన జీవన ప్రమాణాలు అందుకోవాలనేనని గల్లా జయదేవ్ అభిప్రాయపడ్డారు.

More Telugu News