కోలీవుడ్ నటి గాయత్రి ఇంట్లో నర్సు చేతివాటం.. బంగారం చోరీ!
- తల్లికి సపర్యలు చేసేందుకు నర్సు నియామకం
- 111 గ్రాముల బంగారం చోరీ చేసి తాకట్టు
- నర్సును అదుపులోకి తీసుకున్న పోలీసులు
కాగా, ఇటీవల నటి ఇంట్లో 111 గ్రాముల బంగారం చోరీకి గురైంది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా చోరీకి పాల్పడింది నటి ఇంట్లోని నర్సు శివకామియేనని పోలీసులు నిర్ధారించారు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా దొంగిలించిన బంగారాన్ని శివకామి తాకట్టు పెట్టినట్టు తేలింది. దీంతో బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు నటి గాయత్రికి అందజేశారు.