తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం... వరంగల్ సమీపంలో ఐదుగురి దుర్మరణం!

5 Died Near Warangal Road Accident
  • ముందెళుతున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన కారు
  • ఇసుక లారీ ఢీకొనడంతో ప్రమాదం
  • కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు
వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం సమీపంలో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురిని బలి తీసుకుంది. పసరగొండ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఎదురెదురుగా వేగంగా వస్తున్న ఇసుక లారీ, ఓ కారు ఢీ కొన్నాయని పోలీసులు వెల్లడించారు.

మరణించిన వారు జిల్లా పరిధిలోని పోచం మైదాన్ కు చెందిన వారని, వారిని మేకల రాకేశ్, చందు, రోహిత్, పవన్, సాబిర్ లుగా గుర్తించామన్నారు. ప్రాథమిక ఆధారాలను బట్టి, ముందు వెళుతున్న ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. కాగా, ఘటనా స్థలాన్ని సందర్శించిన ఏసీపీ శ్రీనివాస్, సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతదేహాలను వరంగల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసును నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు.
Go Back to Shorts
Warangal Rural District
Road Accident
5 died

More Telugu News