ఈఎస్ఐ స్కామ్: మరింతగా బయటపడుతున్న దేవికారాణి, నాగలక్ష్మి అక్రమాస్తులు
- బిల్డర్ కు రూ.4 కోట్లకు పైగా ఇచ్చిన దేవికారాణి, నాగలక్ష్మి
- ఓ రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొనుగోలుకు యత్నం
- ఏసీబీ అధికారులకు ఆ డబ్బు తిరిగిచ్చేసిన బిల్డర్
ఓ బిల్డర్ కు రూ. 4 కోట్లకు పైగా ఇచ్చారన్న సమాచారంతో దాడులు చేసిన అధికారులు, ఆ బిల్డర్ వద్ద రూ.4.47 కోట్లను సీజ్ చేశారు. ఆ బిల్డర్ ఆస్తులను అటాచ్ చేస్తామని హెచ్చరించడంతో అతడు ఆ డబ్బును అధికారులకు తిరిగి ఇచ్చేసినట్టు తెలుస్తోంది. ఈ మొత్తంలో రూ.3.37 కోట్లు దేవికారాణి డబ్బు కాగా, మిగతా డబ్బు నాగలక్ష్మికి చెందినదని సమాచారం. అవినీతి సొమ్ముతో వీరిద్దరూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని భావించారని ఏసీబీ అధికారులు అంటున్నారు.