కరోనా మహమ్మారి నివారణ కోసం చైనా వింత విధానాలు!
- షింజియాంగ్లో 45 రోజులుగా కఠిన లాక్డౌన్
- సంప్రదాయ మందులను బలవంతంగా మింగిస్తున్న అధికారులు
- సామర్థ్యాన్ని ప్రశ్నిస్తున్నా పట్టించుకోని వైనం
ఆ మందుల సామర్థ్యంపై ప్రజలు ప్రశ్నిస్తున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. జైళ్లు, ఇతర నిర్బంధ కేంద్రాలలో అయితే బలప్రయోగం చేసి మరీ వారితో ఆ ఔషధాలు మింగిస్తున్నారు. ఈ మందులు వేసుకున్న వారిలో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా వాంతులు, చర్మం పైపొర ఊడిపోతుండడం వంటి సమస్యలు కనిపిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. కాగా, షింజియాంగ్ లో గత 45 రోజులుగా కఠిన లాక్డౌన్ అమలవుతోంది.