Unlock-4: అన్ లాక్ 4.0 మార్గదర్శకాలు ఇవే!

  • సెప్టెంబరు 7 నుంచి మెట్రో రైళ్లు
  • సినిమా థియేటర్లకు నో చెప్పిన కేంద్రం
  • 100 మందితో సమావేశాలకు అనుమతి
  • సెప్టెంబరు 21 నుంచి మరికొన్ని అనుమతులు
Centre releases new guidelines under latest Unlock

కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు సుదీర్ఘకాలం పాటు లాక్ డౌన్ విధించిన కేంద్రం, ఆ లాక్ డౌన్ ను దశలవారీగా సడలిస్తోంది. ఈ క్రమంలో అన్ లాక్ 4.0 మార్గదర్శకాలు విడుదల చేశారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన చేసింది. అన్ లాక్ 4.0 సడలింపులు, మార్గదర్శకాలు సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా అన్ లాక్ 4.0 రూపొందించారు.

  • సెప్టెంబరు 7 నుంచి మెట్రో సేవలు ప్రారంభం. మెట్రో సేవల నిర్వహణలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) పాటించాల్సి ఉంటుంది. మెట్రో రైళ్లను దశలవారీగా నడపనున్నారు.
  • సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టయిన్ మెంట్ పార్కులు, థియేటర్లు సెప్టెంబరు 30 వరకు మూసివేత.
  • సామాజిక, విద్యా, క్రీడా, వినోద, సాంస్కృతిక, మతపరమైన, రాజకీయ కార్యక్రమాలకు షరతులతో కూడిన అనుమతి. 100 మందితో కార్యక్రమాలు జరుపుకునేందుకు సమ్మతి. అయితే ఫేస్ మాస్కులు, భౌతికదూరం, థర్మల్ స్కానింగ్ ఏర్పాట్లు, శానిటైజర్/హ్యాండ్ వాష్ తప్పనిసరి.
  • సెప్టెంబరు 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లు తెరుచుకోవచ్చు.
  • సెప్టెంబరు 30 వరకు స్కూళ్లు, కాలేజీలు, విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు మూసివేత.  
  • ఆన్ లైన్/దూరవిద్య విధానంలో విద్యాబోధనకు ప్రోత్సాహం.
  • సెప్టెంబరు 21 నుంచి.... రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రభుత్వాలు ఆన్ లైన్ క్లాసులు, టెలి కౌన్సిలింగ్, ఇతర కార్యకలాపాల కోసం సగం మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ను స్కూళ్లకు అనుమతించవచ్చు.
  • కంటైన్మెంట్ జోన్ల వెలుపల 9 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు స్కూళ్లకు వెళ్లవచ్చు. అది కూడా వారికిష్టమైతేనే. దీనికి వారి తల్లిదండ్రులు, సంరక్షకుల నుంచి లిఖితపూర్వక అనుమతి ఉండాలి.
  • ఐటీఐలు, ఇతర నైపుణ్య అభివృద్ధి సంస్థల్లో కార్యకలాపాలకు అనుమతి.
  • సాంకేతిక, వృత్తిపరమైన విభాగాలకు చెందిన పీహెచ్ డీ, పీజీ విద్యార్థులకు ల్యాబ్ వర్క్ చేసుకునేందుకు అనుమతి.
  • కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అనుమతించిన మేరకు మినహాయించి అన్ని అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగింపు.
  • ఓవరాల్ గా కంటైన్మెంట్ జోన్లలో సెప్టెంబరు 30 వరకు లాక్ డౌన్ అమలు.

More Telugu News