Vinesh Phogat: భారత రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్ కు కరోనా పాజిటివ్

  • ఖేల్ రత్న పురస్కారానికి ఎంపికైన వినేశ్ 
  • కరోనాతో కార్యక్రమానికి దూరం
  • హోం ఐసొలేషన్ లో ఉన్న ఫొగాట్
Vinesh Phogat tests with Corona positive

భారత క్రీడాకారులపై కూడా కరోనా పంజా విసురుతోంది. ఐపీఎల్ ఆడుతున్న కొందరు క్రికెటర్లకు పాజిటివ్ అని తేలిన సంగతి తెలిసిందే. తాజాగా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కూడా ఈ మహమ్మారి బారిన పడింది. రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు వినేశ్ ఫొగాట్ ఎంపికైన సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో వర్చువల్ గా అందిస్తున్న ఈ పురస్కారాలకు ఆమె దూరమయ్యారు. క్రీడాపురస్కారాలను అందుకోనున్న 74 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా వినేశ్ కు కరోనా సోకినట్టు తేలింది. అయితే, ఆమెకు కరోనా లక్షణాలు ఏమీ లేవు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా తెలిపింది. ప్రస్తుతం తాను హోం ఐసొలేషన్ లో ఉన్నట్టు వెల్లడించింది.

More Telugu News