War Bunkers: విశాఖ తీరంలో మూడు ప్రాంతాల్లో బయటపడ్డ యుద్ధ బంకర్లు

  • బయటపడిన రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి బంకర్లు
  • జపాన్ దాడుల నుంచి రక్షణ కోసం నిర్మితమైన బంకర్లు
  • చూసేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్న స్థానికులు
War bunkers found in Vizag

రెండో ప్రపంచయుద్ధం కాలంనాటి యుద్ధ బంకర్లు విశాఖలో బయటపడ్డాయి. విశాఖ, యారాడ, జాలరిపేట తదితర ప్రాంతాల్లో తీర ప్రాంతంలోని ఇసుక కోతకు గురి కావడంతో ఈ బంకర్లు బయటపడ్డాయి. తొలుత వీటిని చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. వీటిని చూసేందుకు నగరవాసులు ఆసక్తిని చూపుతున్నారు.

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటీష్ వారి తరపున భారత నావికులు జపాన్ తో పోరాడారు. ఆ సమయంలో శత్రుదేశం వాయు, నౌక దాడుల నుంచి ఈ బంకర్ల ద్వారా సైనికులు రక్షణ పొందారు. ఈ బంకర్లను కాంక్రీట్ తో నిర్మించారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో విశాఖపై దాడి చేసేందుకు జపాన్ సిద్ధపడినట్టు కూడా చరిత్రకారులు చెపుతున్నారు. ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనది కావడంతో తూర్పు నావికాదళాన్ని ఏర్పాటు చేశారు.

More Telugu News