ఇది అమరావతి రైతులకు పాక్షిక విజయం: రఘురామకృష్ణరాజు
- వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు చట్టం అమలుపై స్టేటస్ కో
- రైతులు మరింత ఆశాభావంతో ఉండాలన్న రఘురామ
- గాంధేయ మార్గంలో ముందుకెళ్లాలని సూచన
ఫలితం కాస్త ఆలస్యమైనప్పటికీ గాంధేయ మార్గంలో ముందుకెళ్లాలని అమరావతి రైతులకు ఉద్బోధించారు. దేవుడు తమవైపు ఉన్నాడని, న్యాయం తమవైపు ఉందని అన్నారు. స్టేటస్ కో అయినా, స్టే అయినా పెద్దగా తేడా ఏమీ లేదని, న్యాయమూర్తులే దేవుళ్లని పేర్కొన్నారు. కౌలు అడిగిన రైతులను అరెస్ట్ చేసి నిన్న సాయంత్రం 4 గంటలకు వదిలినట్టు తనకు తెలిసిందని, రైతులను అరెస్ట్ చేయడం బాధాకరమని రఘురామ వ్యాఖ్యానించారు.