లారీలో రూ. 10 కోట్ల విలువైన రెడ్‌మి సెల్‌ఫోన్లు.. సినీ ఫక్కీలో దుండగుల హైజాక్!

Robbers waylay lorry loot 5 crore worth mobile phones
  • చెన్నై నుంచి సెల్‌ఫోన్లతో ముంబైకి బయలుదేరిన కంటెయినర్
  • మరో లారీతో వెంబడించి డ్రైవర్‌ను కొట్టి లారీతో పరార్
  • సగం సరుకు తీసుకుని లారీని వదిలేసి వెళ్లిపోయిన దుండగులు
తమిళనాడు నుంచి ముంబైకి దాదాపు 10 కోట్ల రూపాయల విలువైన సెల్‌ఫోన్లతో బయలుదేరిన ఓ కంటెయినర్ లారీని దుండగులు సినీఫక్కీలో హైజాక్ చేసి అందులోని సరుకును కొల్లగొట్టారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన తమిళనాడులోని పొన్‌పాడి చెక్‌పోస్టు వద్ద ఈ ఘటన జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం.. శ్రీపెరంబదూరు నుంచి ఎంఐ (రెడ్‌మి) కంపెనీకి చెందిన సెల్‌ఫోన్ల లోడుతో ఓ కంటెయినర్ లారీ మంగళవారం రాత్రి ముంబైకి బయలుదేరింది. మరో లారీలో ఆ లారీని వెంబడించిన దుండగులు పొన్‌పాడి చెక్‌పోస్టు వద్ద సరుకు ఉన్న లారీని అడ్డగించి డ్రైవర్‌ను కొట్టి కంటెయినర్‌ను తీసుకెళ్లారు.

నిర్మానుష్య ప్రదేశానికి లారీని తీసుకెళ్లి అందులో ఉన్న 16 బాక్సుల్లో 8 బాక్సులను (దాదాపు రూ. 5 కోట్ల విలువ) దోచుకుని లారీని అక్కడే వదిలేసి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కంటెయినర్ లారీని నిన్న స్టేషన్‌కు తరలించి దర్యాప్తు ప్రారంభించారు. ముంబైకి చెందిన లారీ డ్రైవర్ ఇర్ఫాన్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
Go Back to Shorts
Tamil Nadu
Mumbai
Robbers
Redmi

More Telugu News