చిన్నారులు, టీనేజర్లకు కరోనా ముప్పు అధికం: సీరం సర్వేలో వెల్లడి
- ఢిల్లీలో మొత్తం 15 వేల మందిపై సర్వే
- 5-17 ఏళ్ల మధ్య వయసు వారిలో 34.7 శాతం మందికి కరోనా ముప్పు
- ఢిల్లీలోని మొత్తం జనాభాలో 29.1 శాతం మందిలో యాంటీబాడీలు
సీరం సర్వే నివేదిక ప్రకారం.. ఢిల్లీలోని మొత్తం జనాభాలో 29.1 శాతం మందిలో వైరస్తో పోరాడే ప్రతిరోధకాలు అభివృద్ధి చెందాయి. 50 ఏళ్లు పైబడిన వారిలో 31.2 శాతం మంది కరోనా కోరల నుంచి బయటపడగా, 18-50 సంవత్సరాల మధ్య వయసున్న వారిలో 28.5 శాతం మందిలో యాంటీబాడీలు అభివృద్ధి చెందినట్టు సర్వే వివరించింది.