Bombay IIT: వర్చువల్ రియాలిటీ విధానంలో బాంబే ఐఐటీ స్నాతకోత్సవం 

  • ముగిసిన బాంబే ఐఐటీ 58వ స్నాతకోత్సవం
  • ముఖ్య అతిథిగా నోబెల్ విజేత డంకన్ హల్డేన్
  • వర్చువల్ ఆకారాలతో స్నాతకోత్సవం నిర్వహణ
Bombay IIT Convocation in Virtual reality mode

కరోనా మహమ్మారి రాక అనేక సాంకేతిక విధానాల అమలుకు బాటలు వేసింది. తాజాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో బాంబే ఐఐటీలో వర్చువల్ రియాలిటీ విధానంలో స్నాతకోత్సవం నిర్వహించారు. బాంబే ఐఐటీ 58వ స్నాతకోత్సవం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నోబెల్ విజేత డంకన్ హల్డేన్ వర్చువల్ విధానంలో హాజరయ్యారు.

అయితే, ఈ కార్యక్రమం కోసం వినూత్నరీతిలో విద్యార్థులు, ప్రొఫెసర్లు, ముఖ్య అతిథి, ఇతర అతిథులకు చెందిన డిజిటల్ రూపురేఖల్ని సృష్టించి, ఆ వర్చువల్ ఆకారాలతో తెరపై నిజంగానే స్నాతకోత్సవం జరుగుతోందన్న భావన కలుగుజేశారు. దీన్ని లైవ్ స్ట్రీమింగ్ చేశారు. బాంబే ఐఐటీ 62 ఏళ్ల చరిత్రలో ఈ విధంగా పతకాలు ప్రదానం చేయడం ఇదే ప్రథమం. కాగా, ఈ ఏడాది ప్రెసిడెంట్ మెడల్ ను బీటెక్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థి సాహిల్ హిరాల్ షా గెలుచుకున్నాడు.


More Telugu News